Asianet News TeluguAsianet News Telugu

హోం మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న మేకతోటి సుచరిత..

గుంటూరు, హోంమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మహిళలు సన్మానం చేశారు. 

గుంటూరు, హోంమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మహిళలు సన్మానం చేశారు. గుంటూరు రూరల్ కు చెందిన మహిళలు హోంమంత్రి సుచరితకు శాలువా కప్పి, పుష్ప గుచ్ఛంతో సన్మానించారు. గుంటూరు పార్లమెంట్ సేవాదల్ అధ్యక్షుడు వెంకటప్పా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సర కాలంలో దిశ చట్టం, దిశ యాప్, గ్రామ మహిళా పోలీస్ వ్యవస్థ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ, భద్రత కలిగించారని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది మహిళలు కొనియాడారు.