Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో దారుణం... ఎంబిబిఎస్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి, కిరాతక హత్య

గుంటూరు : తన ప్రేమను అంగీకరించడం లేదని ఎంబిబిఎస్ విద్యార్థినిపై ఓ ఉన్మాది కిరాతకంగా దాడిచేసి చంపాడు.

గుంటూరు : తన ప్రేమను అంగీకరించడం లేదని ఎంబిబిఎస్ విద్యార్థినిపై ఓ ఉన్మాది కిరాతకంగా దాడిచేసి చంపాడు. సర్జికల్ బ్లేడ్ తో యువతిపై దాడికి పాల్పడి అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ క్రమంలో యువతి మృతిచెందగా యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో చోటుచేసుకుంది. 

ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ ఎంబిబిఎస్ చదువుతున్న తపస్విని ప్రేమించుకున్నారు. ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావడంతో ఇటీవల ఇద్దరూ విడిపోయారు. అయితే ప్రేమించిన యువతి దూరం కావడంతో 
ఉన్మాదిలా మారిన జ్జానేశ్వర్ చివరకు ఆమెను చంపడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే తపస్విని సర్జికల్ బ్లేడ్ తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రక్తపుమడుగులో పడివున్న యువతిని స్థానికులు గుంటూరులోని ఓ హాస్పిటల్ కు తరలించినా ఫలితంలేకుండా పోయింది. చికిత్స పొందుతూ తపస్వి మృతిచెందింది. మనవరాలి మృతిపై నాన్నమ్మ, తాతయ్య ఆవేదన చూసేవారికీ కన్నీరు పెట్టిస్తోంది.