Asianet News TeluguAsianet News Telugu

నాకు ప్రాణహాని వుంది... రక్షణ కల్పించండి: మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అకౌంటెంట్ ఫిర్యాదు

గుంటూరు : మంగళగిరి ఎర్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం తనపై దాడికి పాల్పడిందంటూ స్థానిక పోలీసులకు హాస్పిటల్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఇంచార్జ్ రొంపిచెర్ల కిషోర్ ఫిర్యాదు చేసాడు.

గుంటూరు : మంగళగిరి ఎర్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం తనపై దాడికి పాల్పడిందంటూ స్థానిక పోలీసులకు హాస్పిటల్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఇంచార్జ్ రొంపిచెర్ల కిషోర్ ఫిర్యాదు చేసాడు. తనకు ప్రాణహాని వుందని... రక్షణ కల్పించాలని కిషోర్ పోలీసులను కోరాడు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ వున్నా తనను విధులకు అనుమతించడం లేదని... భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కిషోర్ ఆవేదన వ్యక్తం చేసాడు. దీంతో  పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని సిసి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.