Asianet News TeluguAsianet News Telugu

గిద్దలూరులో దారుణం... రైలుకు, ప్లాట్ ఫాంకు మద్య ఇరుక్కుపోయిన యువకుడు

ప్రకాశం : కదులుతున్న రైల్లోంచి హడావుడిగా దిగబోయిన ఓ యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం : కదులుతున్న రైల్లోంచి హడావుడిగా దిగబోయిన ఓ యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. రైలుకు, ప్లాట్ ఫాం కు మధ్యలో వ్యక్తి ఇరుక్కుపోగా రైల్వే సిబ్బంది అప్రమత్తతో ప్రాణాలు దక్కాయి.  ప్రకాశం జిల్లాకు చెందిన రవికుమార్ బేతంచర్లకు రైల్లో బయలుదేరాడు. అయితే రైల్లో నిద్రించడంతో దిగవలసిన స్టేషన్ లో దిగలేకపోయాడు. నిద్రలేచాక ఈ విషయం గమనించిన అతడు గిద్దలూరు రైల్వేస్టేషన్ లో కదులుతున్న ట్రైన్ దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడు ప్లాట్ ఫాం, రైలుకు మద్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అయితే రైల్వే సిబ్బంది ప్లాట్ ఫాం ను పగలగొట్టి అతడిని కాపాడి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే వున్నట్లు తెలుస్తోంది.
 

Video Top Stories