Asianet News TeluguAsianet News Telugu

వైన్ షాపు రేకులు పగలగొట్టి.. రూ. 86వేల మద్యం చోరీ...

కృష్ణాజిల్లా, ఆగిరిపల్లి శివార్లలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. 

కృష్ణాజిల్లా, ఆగిరిపల్లి శివార్లలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి పూట ముఖానికి కర్చీప్ కట్టుకున్ని.. దుకాణం పైన ఉన్న రేకులను పగులగొట్టి పైనుండి వైన్ షాపులో ప్రవేశించి  86 వేల రూపాయల విలువ చేసే మద్యం బాటిల్స్ ను ఎత్తుకెళ్లాడు. షాపులోని సిసి టీవీ కెమెరాల్లో నిందితుడు నమోదయ్యాడు. అతన్నిగుర్తుపడితే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు పట్టిచ్చిన వారికి తగిన బహుమతి కూడా ఇస్తామంటున్నారు. డిఎస్పి నూజివీడు 9440796408, సీఐ హనుమాన్ జంక్షన్ 8332983804, ఎస్సై ఆగిరిపల్లి9440796444 నెం.లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.