Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ విషాదం : బాధిత గ్రామాల్లో విజయసాయి, మంత్రుల రాత్రి నిద్ర

ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ కెమికల్ ప్రభావం తగ్గిందని ప్రజలు నిరూపించేందుకు మంత్రులే స్వయంగా రంగంలోకి దిగారు.

ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ కెమికల్ ప్రభావం తగ్గిందని ప్రజలు నిరూపించేందుకు మంత్రులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు స్వయంగా మంత్రులే సదరు గ్రామాల్లో బస చేశారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణలు బస చేశారు. ఓ ఇంటి ఆరుబయట విజయసాయిరెడ్డి నిద్రించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేశారు. పద్మనాభపురంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కంపరపాలెంలో మంత్రి కన్నబాబు, నందమూరి నగర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎస్సీ, బీసీ కాలనీలో ధర్మాన కృష్ణదాసు రాత్రికి బస చేశారు.