Asianet News TeluguAsianet News Telugu

AP Capital Crisis : రాజధానిలో భారీగా మోహరించిన మహిళా హోం గార్డులు... పాదయాత్రకు అంతా సిద్ధం...

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతినుండి మార్చే విషయంలో జరుగుతున్న రాజధాని రైతుల ఆందోళన ఇవ్వాళ్టికి 24వ రోజుకు చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతినుండి మార్చే విషయంలో జరుగుతున్న రాజధాని రైతుల ఆందోళన ఇవ్వాళ్టికి 24వ రోజుకు చేరుకుంది. శుక్రవారం జేఎసీ ఆధ్వర్యంలో రాజధాని రైతులు విజయవాడకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో మహిళ హోమ్ గార్డులు భారీగా దిగారు. కరకట్టమీదికి రైతులు దూసుకురాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కరకట్టమీదికి వాహనాలను అనుమతించడం లేదు.