చంద్రన్న అశయ సాధన యాత్ర : కోడెల శివరాం అరెస్ట్

కొండమోడు. పేరేచర్ల రోడ్డు విస్తరణ చేపట్టాలని, దేవరంపాడు ఆలయ అభివృద్ది పనులు చేయాలని డిమాండ్లతో చంద్రన్న అశయ సాధన యాత్ర మొదలు పెట్టిన కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సత్తెనపల్లి పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ ,కోడెల కార్యలయం దగ్గర పోలీసులు మోహరించారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. పాదయాత్రకు వెళ్లకుండా నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. రాజుపాలెం నుండి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి దగ్గరరికి పాదయాత్ర, దేవరంపాడు  గుడి దగ్గర భోజన ఎర్పాట్లు పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ భవన్  దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

First Published Feb 19, 2022, 12:36 PM IST | Last Updated Feb 19, 2022, 12:36 PM IST

కొండమోడు. పేరేచర్ల రోడ్డు విస్తరణ చేపట్టాలని, దేవరంపాడు ఆలయ అభివృద్ది పనులు చేయాలని డిమాండ్లతో చంద్రన్న అశయ సాధన యాత్ర మొదలు పెట్టిన కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సత్తెనపల్లి పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ ,కోడెల కార్యలయం దగ్గర పోలీసులు మోహరించారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. పాదయాత్రకు వెళ్లకుండా నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. రాజుపాలెం నుండి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి దగ్గరరికి పాదయాత్ర, దేవరంపాడు  గుడి దగ్గర భోజన ఎర్పాట్లు పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ భవన్  దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.