Asianet News TeluguAsianet News Telugu

కుప్పంలో కలకలం... లగేజి బ్యాగ్ లో సగానికి కోసిన మనిషి శరీరం

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. 

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. నడుమూరులోని గురుకుల పాఠశాల సమీపంలో మనిషి సగం శరీరాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టిన లగేజ్ బ్యాగ్ ను స్థానికులు గుర్తించారు. కుప్పం- క్రిష్ణగిరి ప్రధాన రహదారిలోని ఓ బ్రిడ్జి వద్ద ఈ లగేజి బ్యాగ్ పడివుంది.  స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి కుప్పం పోలీసులు చేరుకొని లగేజ్ బ్యాగ్ తెరిచి మృతదేహం సగ భాగాన్ని పరిశీలించారు. నడుము భాగం నుంచి దిగువ కాళ్ల వరకు మాత్రమే బ్యాగులో కుక్కి పడేశారు. కాగా మిగతా సగభాగం కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కేజిఎఫ్, క్రిష్ణగిరి, తిరుపత్తూరు ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.