Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు డౌన్ డౌన్.. గిలకదిండిలో టీడీపీకి భూస్థాపితం చేస్తాం.. : గ్రామస్తుల ఆగ్రహం

కృష్ణాజిల్లా, మచిలీపట్నం గిలకలదిండిలో ఉద్రిక్తత నెలకొంది.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం గిలకలదిండిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై  కోర్టులో స్టే తీసుకురావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మా భూములు మాకే కావాలంటూ నినాదాలు, తెలుగుదేశం పార్టీని గిలకలదిండిలో భూస్థాపితం చేస్తాం అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.