Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో విమాన సర్వీసులు షురూ... ఒక్కరోజు ఆలస్యంగా..

విశాఖ విమానాశ్రయం నుండి లాక్ డౌన్ కారణంగా నిలిచిన  విమానాల రాకపోకలు సుమారు రెండు నెలల తరువాత ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.

విశాఖ విమానాశ్రయం నుండి లాక్ డౌన్ కారణంగా నిలిచిన  విమానాల రాకపోకలు సుమారు రెండు నెలల తరువాత ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.  ఇవాళ ఉదయం ఏడుగంటలకు నాలుగు విమాన సర్వీస్ లతో ప్రారంభం అయ్యాయి.  ఉదయం ఏడు గంటలకు మొదటి విమానం బెంగుళూరు నుండి  విశాఖ చేరుకుంది. దీంట్లో విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికులను వైద్య పరీక్షల కోసం తరలించారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి స్క్రీనింగ్ చేసి, స్వాబ్ కలెక్షన్ తర్వాత హోమ్ క్వారంటైన్ కు తరలించారు. విశాఖ ఎయిర్ పోర్టులో డి&హెచ్.ఓ, ఆర్డీవో, పోలీసులు కోవిడ్ ప్రోటోకాల్స్  పర్యవేక్షిస్తున్నారు.