Asianet News TeluguAsianet News Telugu

చెప్పుల వద్దే ధీనంగా కూర్చుని... చనిపోయిన యువతి కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు

యానాం : తమను ప్రేమించే యజమానులపై కుక్కలు ఎంతో విశ్వాసం ప్రదర్శిస్తుంటారు.

యానాం : తమను ప్రేమించే యజమానులపై కుక్కలు ఎంతో విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. మానవ సంబంధాలు విచ్చిన్నం అవుతున్న ఈ కలికాలంలో తమను పెంచిపోషిస్తున్న యజమానులకు కన్నబిడ్డల్లా తోడుకు వుంటున్నాయి పెంపుడు కుక్కలు. ఇలా తనను ప్రేమగా చూసుకునే యజమానురాలు ఆత్మహత్య చేసుకోగా పెంపుడు కుక్క మాత్రం ఎదురుచూపులు చూస్తూనే వుంది. యజమానురాలి చెప్పుల వద్ద పెంపుడుకుక్క ధీనంగా కూర్చునివున్న హృదయవిదారక ఘటన యానాంలో వెలుగుచూసింది. 

యానాం ఫెర్రీ రోడ్డులో నివాసముండే మందాగి కాంచన ఓ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేది. దీంతో ఆమెపై కుక్క ఎంతో విశ్వాసం చూపించేది. అయితే ఏ కష్టం వచ్చిందో ఏమోగాని పెంపుడు కుక్కతో కలిసి గోదావరి నదివద్దకు వెళ్లిన కాంచన యానాం-ఎదుర్లంక బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. యజమానురాలు కనిపించకపోవడంతో ఆమె చెప్పుల వద్ద దీనంగా కూర్చుంది పెంపుడు శునకం. ఇంకా తమ యజమానురాలు వస్తుందని ఎదురుచూస్తూనే వుంది.