Asianet News TeluguAsianet News Telugu

దేవుడి మాన్యం ఘర్షణ.. తలలు పగలగొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు

కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో దేవుని మాన్యం విషయంలో టిడిపి వైసిపి వర్గాల మద్య ఘర్షణలో నలుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో దేవుని మాన్యం విషయంలో టిడిపి వైసిపి వర్గాల మద్య ఘర్షణలో నలుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని వీరభద్రస్వామి గుడి మాన్యమైన 14 ఎకరాల భూమిని గతేడాది వైసీపీ వారు సాగు చేసుకున్నారు. ఈ ఏడాది టీడీపీ వాళ్లు సాగు చేసుకోవాలి. అయితే ఆ పొలాన్ని వారు సాగుచేయకూడదంటూ మొలకెత్తిన పొలంలోకి ట్రాక్టర్ ను దించారు. దీంతో టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఈ రోజుఉదయం ఎడ్లబండ్లతో వైసీపీవర్గీయులు పొలంలోకి దిగారు. టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.