Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు ధన్యవాదాలు తెలిపిన నవీన్ పట్నాయక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఏపీ నుంచి ఒడిశా వలస కూలీలు, కార్మికులు, తరలింపుపై చర్చలు జరిగాయి. అలాగే ఒడిశాలో ఉన్న ఏపీ వాళ్లనికూడా తరలించే విషయమై చర్చలు జరిగాయి. ఏపీలో చిక్కుకుపోయిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు అందించి ఆదుకున్నందుకు జగన్‌కు నవీన్ పట్నాయక్ ధన్యవాదాలు తెలిపారు.