Asianet News TeluguAsianet News Telugu

పేదలందరికీ ఆరోగ్యమే జగన్ లక్ష్యం.. వైద్యారోగ్యానికి 16వేల కోట్లు.. ఆళ్ల నాని

పేద‌లంద‌రికీ ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ధ్యేయ‌మ‌ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, వైద్యారోగ్య‌శాఖామంత్రి ఆళ్ల నాని అన్నారు.

పేద‌లంద‌రికీ ఆరోగ్యాన్ని అందించ‌డ‌మే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ధ్యేయ‌మ‌ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, వైద్యారోగ్య‌శాఖామంత్రి ఆళ్ల నాని అన్నారు.  నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా సుమారు రూ.16వేల కోట్ల ఖ‌ర్చుతో వైద్యారోగ్య‌రంగంలో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కోసం త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని  చెప్పారు. విజ‌య‌న‌గ‌రంలో ఏర్పాటు చేయ‌నున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల కోసం, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి,  ర‌వాణా శాఖామంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ తో క‌లిసి గురువారం స్థ‌ల ప‌రిశీల‌న చేశారు.