ఎంపీ సురేష్పై దాడికి నిరసనగా దళితుల ర్యాలీ
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడిలో బాపట్ల ఎంపీ నందిగం.సురేష్ పై దాడికి నిరసనగా గుంటూరు జిల్లాలో దళితులు శుక్రవారం నాడు ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడిలో బాపట్ల ఎంపీ నందిగం.సురేష్ పై దాడికి నిరసనగా గుంటూరు జిల్లాలో దళితులు శుక్రవారం నాడు ర్యాలీ నిర్వహించారు. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు ,తాళ్లాయపాలెం వద్ద దళితులు ర్యాలీ నిర్వహించారు. దళితులపై ప్రజాప్రతినిధులపై చేస్తున్న దాడులను కండిస్తూ ,మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు దళితులు. .హై సెక్యూరిటీ జోన్ కావడంతో భారీగా పోలీసుల మోహరించారు..అమరావతి లో రధోత్సవం ముగించుకుని వెళ్తున్న నందిగం సురేష్ కారును అడ్డగించి మహిళా జేఏసీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.