Asianet News TeluguAsianet News Telugu

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత... భవన నిర్మాణ కార్మికుల ముట్టడితో

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భవన నిర్మాణ కార్మికులు ప్రయత్నించారు.  

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భవన నిర్మాణ కార్మికులు ప్రయత్నించారు.  రాష్ట్రంలో ఇసుక కొరత, సిమెంటు ధరల పెంపును నిరసిస్తూ దాదాపు 100 మంది కార్మికులు సీఎం కార్యాయలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. క్యాంపు కార్యాలయ సమీపానికి ఒక్కసారిగా కార్మికులు వచ్చినా ముందుగానే అప్రమత్తంగా వున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరగ్గా కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  ఇసుక కొరత, సిమెంటు ధరలు పెరగడంతో తమకు పనులు తగ్గిపోయాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.