Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ పుట్టినరోజున బృహత్తర కార్యక్రమం... అధికారులకు సీఎం జగన్ ఆదేశం

అమరావతి: నవరత్నాలు, పేదలందరికి ఇళ్ళ పట్టాల పంపిణీ, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమరావతి: నవరత్నాలు, పేదలందరికి ఇళ్ళ పట్టాల పంపిణీ, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ ల భవన నిర్మాణాల పనులు వేగంగా జరగాలపని సీఎం ఆదేశించారు.మే నాటికల్లా గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలు మెరుగుపడాలని సూచించారు. జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్బంగా ప్రారంభించాలన్న సీఎం ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన విలేజ్ క్లినిక్స్ నిర్మాణం జరగాలని... ఆగస్టు 15న విలేజ్ క్లీనిక్ లను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్థాయిలో ఆరోగ్యశ్రీ రిఫరెల్ పాయింట్ గా విలేజ్ క్లీనిక్స్ ఉంటాయని జగన్ పేర్కొన్నారు.