వైసీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ: పికెట్
కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో వైస్సార్సీపీకి చెందిన బిజ్జం పార్థసారథి రెడ్డి.కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డిలకు చెందిన రెండు గ్రూపులుగా చీలిపోయారు.
కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో వైస్సార్సీపీకి చెందిన బిజ్జం పార్థసారథి రెడ్డి.కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డిలకు చెందిన రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఆదివారం ఆంజనేయస్వామి గుడి వద్ద కిరణ్ కుమార్ రెడ్డి కూర్చొన్నాడు. అదే సమయంలో మారేమడుగుల శివారెడ్డి తన పొలం పనులకు వెళ్తుండగా కాలు ఊపి మీసం తిప్పాడు. నన్ను చూసి మీసాలు తిప్పుతావా అని ప్రశ్నించిన శివారెడ్డి. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై శివారెడ్డి చేయి చేసుకొన్నాడు.