Asianet News TeluguAsianet News Telugu

అహోబిలంలో చిరుత కలకలం.. నడిరోడ్డుపై దర్జాగా పడుకుని...

ఆళ్ళగడ్డ నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్లేదారిలో దుర్గమ్మ గుడి వద్ద రోడ్డుపై చిరుత పులి ఠీవీగా కూర్చుని కనిపించింది. 

ఆళ్ళగడ్డ నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్లేదారిలో దుర్గమ్మ గుడి వద్ద రోడ్డుపై చిరుత పులి ఠీవీగా కూర్చుని కనిపించింది. దీంతో అటుగా వెల్తున్న వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ చిరుత గతంలో కూడా చాలాసార్లు  అక్కడ కనిపించిందని, పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు చెప్పినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు.  అహోబిలానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఈ చిరుతను గమనించి వీడియో తీసి,  ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు.