Asianet News TeluguAsianet News Telugu

ఆ పోలీసులను వదిలేది లేదు... కాళ్ల బేరానికి వచ్చేలా: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతి: అక్రమ కేసులు పెడితే మౌనంగా ఉండొద్దని టిడిపి కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు సూచించారు. 

అమరావతి: అక్రమ కేసులు పెడితే మౌనంగా ఉండొద్దని టిడిపి కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు సూచించారు. పోలీసులు ఒక కేసు పెడితే రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలన్నారు. పోలీసులు కాళ్ల బేరానికి రావాలంటే ప్రైవేట్ కేసులు పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తప్పుడు కేసులకు కాలం చెల్లిందన్న ఆయన... ఫిర్యాదు తీసుకోకుంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలని దిశానిర్దేశం చేశారు.  సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ ఊదరకొడుతున్నారని వ్యాఖ్యానించారు. డీజీపీ సూచనను తెదేపా శ్రేణులు వినియోగించుకోవాలని వివరించారు. ఫిర్యాదులు తీసుకోని పోలీసులపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.