Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు జిల్లా నంద్యాల వద్ద కారు ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం..

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కంటైనర్ లారీ, కారు ఢీ కొన్న ఘటనలో అగ్నిప్రమాదం జరిగింది. 

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కంటైనర్ లారీ, కారు ఢీ కొన్న ఘటనలో అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి చెన్నై కి వెళ్తున్న మోటర్ స్పేర్ పార్ట్స్ కంటైనర్ లారీని కర్నూలు నుండి నంద్యాల కు వెళ్తున్న Hyundai i 20 కారు ఢీ కొట్టింది. ముందు వెళ్తున్న లారీ ని కారు డీ కొనడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు బైటికి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒకరు తప్పించుకోలేక సజీవదహనం అయ్యారు. మృతి చెందిన వ్యక్తి నంద్యాల SBI బ్యాంక్ లో పనిచేసే క్లర్క్ శివ కుమార్ గా గుర్తించారు. మృతుడు శివ కుమార్ తల్లి వైద్య చికిత్స కోసం కర్నూలు కు వెళ్లి గత అర్థరాత్రి తిరిగి నంద్యాల కు వచ్చే సమయంలో కారు ప్రమాదం జరిగింది.