టీడీపీ దొంగదీక్షలు ప్రజలు గమనిస్తున్నారు.. మల్లాది విష్ణు
టీడీపీ చేస్తున్న దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ ప్రయోజనాలు తప్ప టీడీపీకి ప్రజాప్రయోజనాలు పట్టవని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు.
టీడీపీ చేస్తున్న దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ ప్రయోజనాలు తప్ప టీడీపీకి ప్రజాప్రయోజనాలు పట్టవని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. విద్యుత్ బిల్లుల్లో టారిఫ్ పెంచినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఐదేళ్లపాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీదని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోందని విమర్శించారు.