Asianet News TeluguAsianet News Telugu

భయం భయం... సత్యసాయి జిల్లాలో గుంపులు గుంపులుగా ఎలుగుబంట్లు

మడకశిర : ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఎలుగుబంట్లు ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. 

మడకశిర : ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఎలుగుబంట్లు ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఎలుగుబంట్లు ఎక్కడ దాడిచేస్తాయోనని భయపడిపోతున్నారు. కర్ణాటక సరిహద్దులోని మడకశిర పరిసరాల్లో ఎలుగుబంట్ల గుంపు కెమెరాకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రజల్లో మరింత భయం పెరిగింది. వెంటనే అటవీ శాఖ అధికారులు ఎలుగుబంట్ల గుంపుల నుండి తమకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని మడకశిర ప్రజలు కోరుతున్నారు.