Asianet News TeluguAsianet News Telugu

వేటగాళ్ల తూటా తగిలి.. అరటిపండ్ల వ్యాపారికి తీవ్ర గాయాలు..

విశాఖజిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ గ్రామ సమీపంలోని అడవిలో దారుణం జరిగింది.

విశాఖజిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ గ్రామ సమీపంలోని అడవిలో దారుణం జరిగింది. అడవిజంతువుల వేటకోసం వెళ్లిన గిరిజనుల తుపాకీ తూటాకు ఓ అరటిపండ్ల వ్యాపారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెడితే సమీప అడవిలో బుధవారం ఉదయమే వేటకు వెళ్లిన గిరిజనులు అడవి జంతువులమీద పేల్చిన తూటా అదే దారిన వెల్తున్న గౌరునాయుడు అనే పండ్ల వ్యాపారి చాతికి తగిలి బలమైన గాయమైంది. విషయం తెలిసిన వెంటనే ఎల్విన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ నారాయణరావు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. నాటు తుపాకితో వేటకు వెళ్లిన వారు పరారీలో ఉన్నట్లు తెలియవచ్చింది.