నరసరావుపేటలో దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సుచరిత
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదివారం ప్రారంభించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసులు హోంమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.