జనతాకర్ఫ్యూ : ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనాపై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.