Asianet News TeluguAsianet News Telugu

చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం.. ప్రకటించిన జగన్

విశాఖ ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ ఘటనలో అస్వస్థతకు గురైన  బాధితులను సీఎం వైఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. 

విశాఖ ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ ఘటనలో అస్వస్థతకు గురైన  బాధితులను సీఎం వైఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. సంఘటన జరిగిన వెంటనే అధికారులతో సమీక్ష జరిపి, ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖకు చేరుకున్నారు. కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్  పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కళాశాల డిజిటల్ క్లాస్ రూంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.