Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ అద్యక్షతన కేబినెట్ భేటీ... ఏపీ బడ్జెట్ 2023-24 కు ఆమోదం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2023-24 కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

First Published Mar 16, 2023, 9:41 AM IST | Last Updated Mar 16, 2023, 9:41 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2023-24 కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌ లను ఆమోదించింది.దీంతో మరికాసేపట్లో శాసనసభలో సాధారణ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, వ్య‌వ‌సాయానికి సంబంధించిన ప్ర‌త్యేక బ‌డ్జెట్ ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండ‌లిలో సాధారణ బడ్జెట్ ను ఉప‌ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా, వ్య‌వ‌సాయ బడ్జెట్ ను పశుసంవర్ధకశాఖ మంత్రి సిదిరి అప్ప‌లరాజు ప్రవేశపెట్టనున్నారు.