Asianet News TeluguAsianet News Telugu

జగన్ కీలక ఆదేశాలు : ఏపీలో అన్ని దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్.. ఆర్టీసీ సేవలు తొందర్లోనే..

ఆంధ్రప్రదేశ్ లో దుకాణాలు, ఆర్టీసీ సేవలు ప్రారంభించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ లో దుకాణాలు, ఆర్టీసీ సేవలు ప్రారంభించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కావాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించడంలో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రంలో చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలని సీఎం జగన్ సూచించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ రెండు నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ.. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాలని సూచించారు.