Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్నిప్రమాదం

గుంటూరులోని గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. 

గుంటూరులోని గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో పైపులు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వ‌డం వల్ల ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఈ మంట‌ల్లో రెండు టూ వీల‌ర్లు పూర్తిగా ద‌హ‌న‌మ‌య్యాయి. ఈ అగ్ని ప్ర‌మాదంపై స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. దీంతో అవి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాయి. మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ఎంత‌గానో కష్ట‌ప‌డుతున్నారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా.