Asianet News TeluguAsianet News Telugu

మున్నేరులో ప్రవాహంలో అంబులెన్స్ ప్రయాణం... పేషంట్ ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ సాహనం

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరులోకి భారీ వరదనీరు చేరుతోంది. 

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరులోకి భారీ వరదనీరు చేరుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద గల బ్రిడ్జిపై నుండి మున్నేరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  ఈ క్రమంలో వత్సవాయికి చెందిన డయాలసిస్ పేషెంట్ కొలగంటి బాబురావు తీవ్ర అనారోగ్యానికి గురయినా హాస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో 108 అంబులెన్స్ డ్రైవర్ కార్తిక్ ప్రాణాలకు తెగించి బాబురావును వైద్యం అందేలా చూసాడు. బ్రిడ్జి పైనుండి వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా ఏమాత్రం భయపడకుండా అంబులెన్స్ ను అందులోంచే పోనిచ్చాడు. ఇలా ప్రాణాలకు తెగించి మరీ అంబులెన్స్ ను మున్నేరు ప్రవాహాన్ని దాటించి జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి చేర్చాడు. ఓ ప్రాణాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేసిన అంబులెన్స్ డ్రైవర్ కార్తీక్ ను అభినందిస్తున్నారు. 

Video Top Stories