Former CJI RC Lahoti: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లహోటీ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిక్సిత పొందుతూ.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. జస్టిస్ లాహోటీ జూన్ 1, 2004న భారతదేశ 35వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన దాదాపు ఏడాదిపైగా పదవీలో సేవలందించి.. నవంబర్ 1, 2005న పదవీ విరమణ చేశారు.