Delhi liquor policy case: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదుచేసుకుని విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ మంగళవారం మరో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును ఈసీ చేర్చింది. మనీష్ సిసోడియా మాజీ సెక్రెటరీ సీ అరవింద్ వెల్లడించిన విషయాల తర్వాత ఎంపీ రాఘవ్ చద్దాను కేసులో చేర్చడం గమనార్హం.
Delhi liquor policy case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ మే 28 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 9న అరెస్టు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ మంగళవారం సప్లిమెంటరీ చార్జిషీట్ వేసింది. ఈ చార్జిషీటులో తొలిసారి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరును ప్రస్తావించింది. ఆయనతోపాటు బుచ్చి బాబు, అర్జున్ పాండే, అమన్దీప్ దల్ల పేర్లనూ పేర్కొంది.
Delhi New Liquor Policy: దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మళ్లీ పాత లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు 1 నుండి మళ్లీ పాత విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు.