Jaahnavi Kandula: ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సియాటెల్ లో భారత విద్యార్థిని జాహ్నవి కందులను పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి సరదాగా, పగలబడి నవ్వుతున్న వీడియో బయటకు రావడంతో భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా, జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వనున్నట్టు అక్కడి యూనివర్సిటీ ప్రకటించింది.