kurnool Assembly elections result 2024 live : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య ఇక్కడి నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే . కర్నూలులో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఎం రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు , స్వతంత్రులు ఒకసారి విజయం సాధించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కర్నూలు అన్ని పార్టీలను, అన్ని వర్గాలను ఆదరించింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్లు , ముస్లిం మైనారిటీలు, బలిజ, దళిత వర్గాల ప్రాబల్యం అధికం. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీలో చేరిన వెంటనే ఆయనను కర్నూలు అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కర్నూలులో గెలిచి దాదాపు 25 ఏళ్లు కావొస్తోంది.