Rajamahendravaram: అంగళ్ల కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగియగా, పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కస్టడీ పిటిషన్ తో పాటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది.