Asianet News TeluguAsianet News Telugu

Chandrababu arrest: పోలీసుల ఆంక్ష‌లు లెక్క‌చేయ‌కుండా టీడీపీ భారీ నిర‌స‌న‌ ర్యాలీ

Kakinada: తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్‌పై ఆ పార్టీ క్యాడ‌ర్ లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిర‌సిస్తూ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలోనూ టీడీపీ నిరసనలు చేస్తోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఉదయం 10 గంటలకు  ప్రారంభించిన నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొన‌సాగించాల‌ని నిర్ణయించుకున్నారు.
 

Chandrababu Naidu arrest: TDP's massive protest rally ignoring police restrictions RMA
Author
First Published Oct 2, 2023, 7:04 PM IST

TDP activists protest: తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్‌పై ఆ పార్టీ క్యాడ‌ర్ ఆగ్రహం పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిర‌సిస్తూ రాష్ట్రంలోని కాకుండా  దేశ రాజధాని ఢిల్లీలోనూ టీడీపీ నిరసనలు చేస్తోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఉదయం 10 గంటలకు  ప్రారంభించిన నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొన‌సాగించాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల ఆంక్ష‌లు లెక్క‌చేయ‌కుండా టీడీపీ శ్రేణులు ప‌లు చోట్ల భారీ నిర‌స‌న ర్యాలీల‌ను చేప‌ట్టాయి. 

కాకినాడలో పోలీసులు విధించిన ఆంక్షలను లెక్క‌చేయ‌కుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తాడేపల్లిగూడెంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. జయలక్ష్మి థియేటర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఓల్డ్‌ హైవే జంక్షన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, హౌసింగ్‌ బోర్డు జంక్షన్‌ మీదుగా ఎస్‌వీ రంగారావు విగ్రహం వరకు సాగింది. తొలుత పోలీసులు ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తలు ముందుకు సాగారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం టీడీ ఇన్‌చార్జి వలవల మల్లికార్జునరావు బాబ్జీ కిందపడిపోయాడు. చంద్రబాబు నాయుడును విడుదల చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.

చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బాబ్జీ అన్నారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకట్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత పాలనలో తీసుకుంటున్న అన్ని నిర్ణయాలను సమీక్షిస్తుందని అన్నారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఎ.రాధాకృష్ణమూర్తి తదితరులు ఈ నిర‌స‌న‌ల్లో పాల్గొన్నారు. అయితే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. 

ఇదిలావుండ‌గా, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యువనేత లోకేశ్ ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉండటంతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీని నడిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ చేపట్టిన పాదయాత్రను బ్రాహ్మణి కొనసాగిస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా వ‌ర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 5 నుంచి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి భువనేశ్వరి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో తొలి దశ బస్సు యాత్ర కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ భువనేశ్వరి గాంధీ జయంతి రోజైన నేడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios