జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభ ముహూర్తంలోనే గర్భిణులు డెలివరీ కావాలని చాలా మంది దంపతులు కోరుకున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. యూపీ మొదలు మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి. ఈ ముహూర్తంలో ప్రసవించిన పిల్లలకు రామ, సీత పేర్లను పెట్టుకున్నారు.