Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలోనే కాదు తిరుపతిలోనూ మద్య నిషేదం...: టిటిడి నిర్ణయం

బుధవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఆద్యాత్మికతను కాపాడటానికి పలు సంస్కరణలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి కొన్ని సిపార్పులు చేయాలని టిటిడి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

Tirumala Tirupati Devasthanam(ttd) want to ban liquar at Tirupathi
Author
Tirumala, First Published Oct 23, 2019, 8:01 PM IST

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌లకు ఎంతో భ‌క్తిభావంతో భ‌క్తులు వ‌స్తున్నార‌ని... ఇంతటి పవిత్ర ప్రాంతంలో మధ్యపానానికి చ్ోటులేకుండా గతంలోనే చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ ఆధ్యాత్మిక‌భావ‌న మ‌రింత పెంచేలా తిరుమ‌ల త‌ర‌హాలో తిరుప‌తిలోనూ ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లుచేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. 

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధ‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం టిటిడి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి పిలుపుమేర‌కు తిరుమ‌ల‌లో కూడా సంక్రాంతి తర్వాత  ప్లాస్టిక్ వాడ‌కాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌డ‌తామని తెలిపారు. 

తిరుప‌తి న‌గ‌రవాసుల‌తోపాటు బ‌య‌ట ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా గ‌రుడ వార‌ధిని రీడిజైన్ చేసి రీటెండ‌ర్లు పిలిచేందుకు నిర్ణ‌యం  తీసుకున్నట్లు  తెలిపారు. తిరుప‌తి న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు న‌గ‌ర శివార్ల నుండే ఈ వార‌ధి ప్రారంభ‌మ‌య్యేలా డిజైన్‌లో మార్పు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు.

Read more చిరుతిళ్లకు రూ.25 లక్షల ప్రజాధనం ఖర్చు... స్పందించిన లోకేశ్...

నిమ్స్ త‌ర‌హాలో అభివృద్ధి చేసి...మ‌రింత మెరుగైన వైద్య‌సేవ‌లందించేందుకు వీలుగా తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రిని టిటిడి ఆధీనంలోకి తీసుకునే ఏర్పాటు చేశామన్నారు. టిటిడి అట‌వీ విభాగంలో ప‌నిచేస్తున్న 162 మంది సిబ్బందిని రెగ్యుల‌ర్ చేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపామని వెల్లడించారు.
మిగిలిన 200 మందికి మినిమ‌మ్ టైంస్కేల్ వ‌ర్తింప‌చేస్తూ నిర్ణ‌యం  తీసుకున్నట్లు తెలిపారు.

టిటిడి విద్యాసంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న 382 మంది కాంట్రాక్టు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్ల‌కు, క‌ల్యాణ‌క‌ట్ట‌లోని 246 మంది పీస్‌రేట్ క్షుర‌కుల‌కు మినిమ‌మ్ టైంస్కేల్ వ‌ర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. టిటిడి శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించనున్నట్లు ప్రకటించారు.

తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద 200 పైచిలుకు ఎక‌రాల విస్తీర్ణంలో శ్రీ‌వారి భ‌క్తిధామం నిర్మించేందుకు నిర్ణ‌యం  తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక్క‌డ భ‌క్తి ప్ర‌వ‌చ‌నాలు, పిల్ల‌ల్లో భ‌క్తిభావాన్ని పెంచేలా గ్రాఫిక్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లు, ధ్యానం, యోగా కేంద్రాలు, శ్రీ‌వారి వైభ‌వాన్ని తెలిపేలా లేజ‌ర్ షో త‌దిత‌రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Read more వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి, న్యూఇయర్... దాతలకు షాకిచ్చిన టిటిడి...

తిరుమ‌ల‌కు నీటి స‌మ‌స్య‌ను అరిక‌ట్టేందుకు బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి అంచ‌నాలు రూపొందించి ప్ర‌భుత్వానికి పంపనున్నామని అన్నారు. టిటిడిలో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన అర్చ‌కుల సేవ‌ల‌ను తిరిగి ఏ విధంగా వినియోగించుకోవాల‌నే విష‌యంపై విధి విధానాలు రూపొందించేందుకు ఒక క‌మిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మ‌తమార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బిసి ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా ఎక్స్‌ప్రెస్ సేక‌రించేందుకు నిర్ణ‌యం తీసుకున్నామన్నారు.

ఈ మీడియా స‌మావేశంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌,  తుడ ఛైర్మ‌న్ మ‌రియు ఎక్స్ అఫిషియో స‌భ్యులు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు  మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, టిటిడి అదనపు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios