Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లాలో దారుణం....తల్లీకొడుకు సజీవదహనం

చిత్తూరు జిల్లాలో దారుణం చోటేచేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తల్లీ కొడుకులు సజీవ దహనమయ్యారు.  

mother and son died in chittoor
Author
Chittoor, First Published Oct 9, 2019, 1:32 PM IST

చిత్తూరు: చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలంలో దారుణం చోటుచేసుకుంది. గానుగపెంట పంచాయతీ పరిధిలోని కూనపల్లి గ్రామంలో తల్లీకొడుకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో మండలం మొత్తంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన శేఖర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా యుపిఎస్ బ్యాటరీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో తల్లి శంకరమ్మ 75 సంవత్సరాలు కొడుకు శేఖర్ 50 సంవత్సరాలు ఇద్దరు సజీవ దహనమయ్యారు. 

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పాకాల ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  

Follow Us:
Download App:
  • android
  • ios