Asianet News TeluguAsianet News Telugu

టిటిడికి ఒకేరోజు రూ.80 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి ఇవాళ(శుక్రవారం) భక్తులు భారీగా విరాళాలు  సమర్పించుకున్నారు. కేవలం ఇద్దరు భక్తులే భాీర మొత్తంలో విరాళాలు అందించారు.   

devotees donated rs 80 lakhs to tirumala swamy
Author
Tirumala, First Published Oct 11, 2019, 7:20 PM IST

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులైన బెంగ‌ళూరుకు చెందిన  కూపేంద‌ర్‌రెడ్డి శుక్ర‌వారం రూ.70 ల‌క్ష‌లు విలువైన 2 మ‌హేంద్ర అల్టూర‌స్ జి4 కార్ల‌ను 
స్వామివారి సేవకోసం విరాళంగా అందించారు. ఈ మేర‌కు 2 కార్ల‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

devotees donated rs 80 lakhs to tirumala swamy

అలాగే మ‌లేసియాకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు ర‌వీంద్ర సుబ్ర‌మ‌ణియ‌మ్ కూడా శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios