తాను కరోనా బారినపడినట్టు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బాంబు పేల్చారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కోవిడ్ సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా వెల్లడించారు.
తాను కరోనా బారినపడినట్టు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బాంబు పేల్చారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కోవిడ్ సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా వెల్లడించారు.
వైరస్ బారినపడినప్పటికీ పెద్దగా కరోనా లక్షణాలు కనిపించలేదని సానియా వివరించింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తాను ఐసోలేషన్లోనే ఉన్నానని, ఈ సమయంలో తన బాబు, కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టంగా అనిపించిందని సానియా మీర్జా వాపోయారు.
ఇదే సమయంలో కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆసుపత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలా గడిపాయోనన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని సానియా ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని, భౌతికంగా, మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతామని సానియా తన అనుభవాల్ని చెప్పారు.
అయితే కొద్దో గొప్పో తాను అదృష్టవంతురాలినని సానియా పేర్కొంది. కాకపోతే, కుటుంబానికి దూరంగా ఉండటం మాత్రం భయంకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తిరిగి ఫ్యామిలీని ఎప్పుడు చూస్తామో తెలియదన్న సానియా... కరోనా వైరస్ జోక్ కాదని వెల్లడించింది.
వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉందని, మన సన్నిహితులను, కుటుంబాన్ని దీని నుంచి కాపాడుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సానియా మీర్జా సూచించారు. ఇందుకోసం మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 19, 2021, 9:51 PM IST