నీళ్లలో మత్తు కలిపి తాగించి బాలికపై అత్యాచారం: వీడియో తీసి....
హైదరాబాదులో ఓ పెళ్లి వేడుకల్లో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది.
జడ్చర్ల: తెలంగాణలోని మహబూబ్ నగర్ జడ్చర్లలో దారుణమైన సంఘటన జరిగింది. బంధువుల పెళ్లికి వ్చిచన ఓ బాలికను పరిచయం చేసుకుని ఆమెపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇద్దరు స్నేహితుల సహకారంతో మంచినీళ్లలో మత్తు మందు కలిపి ఆ బాలికకు ఇచ్చారు. స్పృహ తప్పగానే ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన యువకుడిని, అతనికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల సీఐ వీరస్వామి చెప్పారు.
జడ్చర్లకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని నిరుడు డిసెంబర్ లో హైదరాబాదులోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది. ఆ సమయంలో మలక్ పేటలోని ముస్తఫానగర్ కు చెదిన సబీల్ (21) పరిచయమయ్యాడు. బాలిక ఫోన్ నెంబర్ తీసుకుని తరుచుగా చాటింగ్ చేస్తూ వచ్చాడు.
ఈ నెల 2వ తేదీన హైదరాబాదుకు చెందిన మిత్రులు సయ్యద్ తాలిబ్ (19), సయ్యద్ అల్తాఫ్ (20)లతో కలిసి జడ్చర్లకు వచ్చాడు. బాలికకు ఫోన్ చేసి కొత్త బస్ స్టాండుకు రప్పించాడు. ఆ తర్వాత సమీపంలోని లాడ్జికి తీసుకుని వెళ్లాడు.
మంచినీళ్లలో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్ాచడు. ఆ తర్వాత ఆమెపై సబీల్ అత్యాచారం చేశాడు. దాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి తర్వాత బంధవుల ఫోన్లకు పంపించాడు. అతని మిత్రులు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను వేధిస్తూ వచ్చారు.
బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా ఆ వీడియో వచ్చింది. దీంతో బాలిక తండ్రి ఆదివారంనాడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను ముగ్గురిని సోమవారంనాడు హైదరాబాదులో అరెస్టు చేసి జడ్చర్లకు తీసుకుని వచ్చారు.