వదిన, మరిది అక్రమ సంబంధం.. కొడుక్కి విషయం తెలిసి..
ఎవరికీ తెలీకుండా ఇద్దరూ కలిసి హైదరాబాద్ కి పారిపోయి వచ్చారు. బల్జీత్ కౌర్ భర్తతో పాటు కుమారుడిని కూడా వదిలేసి మరిదితో కలిసి పారిపోయి వచ్చింది.
రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింత దారుణంగా దిగజారుతున్నాయి. ఒక్క క్షణం తృప్తి కోసం..ఎంతకైనా తెగిస్తున్నారు. వావి, వరసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అడ్డొస్తే ఎవరినైనా అంతమొందిస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఇలాంటి మరో సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లి లాంటి వదినతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని.. చివరకు కొడుకు లాంటి వాడి చేతిలో హతమయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాబ్ కి చెందిన సద్ నామ్ సింగ్ కి పెళ్లి కాలేదు. అన్న భార్య బల్జీత్ కౌర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరికీ తెలీకుండా ఇద్దరూ కలిసి హైదరాబాద్ కి పారిపోయి వచ్చారు. బల్జీత్ కౌర్ భర్తతో పాటు కుమారుడిని కూడా వదిలేసి మరిదితో కలిసి పారిపోయి వచ్చింది.
వీరిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయం చాన్నాళ్ల పాటు పంజాబ్లోని కుటుంబికులకు తెలియలేదు. ఇటీవల వీళ్లు హైదరాబాద్లో నివసిస్తున్నారనే విషయం తెలుసుకున్నారు. బల్జీత్ కౌర్ చేసిన పనితో ఆమె భర్త తీవ్రంగా కుంగిపోయాడు. ఇవన్నీ చూసిన నిషాంత్ సింగ్ కక్ష పెంచుకున్నాడు. నారాయణగూడలోని జాహ్నవి కశాశాల వద్ద సద్నామ్సింగ్ ఫాస్ట్పుడ్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం నిషాంత్ సింగ్కు తెలిసింది. దీంతో ఉపాధి కోసమంటూ హైదరాబాద్కు వచ్చి ఆ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో చేరాలని పథకం వేశాడు. గతంలో ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్లిన నిషాంత్ సింగ్.. ప్రస్తుతం సద్నామ్సింగ్, బల్జీత్ కౌర్లకు ఏడేళ్ల కుమారుడు ఉన్న విషయం తెలుసుకున్నాడు. గత నెలలో మరోసారి వచ్చిన నిషాంత్ తన చిన్నాన్నకు చెందిన ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు.
తన కుమారుడు సిటీకి వచ్చి సద్నామ్సింగ్ వద్దే పని చేస్తూ, వారి ఇంట్లోనే ఉండటాన్ని బల్జీత్ కౌర్ ఇబ్బందిగా భావించింది. దీంతో గత నెల 10న బల్జీత్ పని మీద అఫ్జల్గంజ్ గురుద్వారకు వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోవడంతో అదే అదనుగా భావించిన నిషాంత్సింగ్ ఇంట్లో ఉన్న సద్నామ్సింగ్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం వేశాడు. తానొక్కడినే అతడిని చంపలేననే ఉద్దేశంతో సమీప బంధువుల సహాయం కోరాడు. దీంతో పంజాబ్లోని అతడి మేనత్త కుమారుడితో పాటు బంధువులు గత బుధవారం సిటీకి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అదను చూసుకుని ఈ ముగ్గురూ కలిసి సద్నామ్సింగ్ను హత్య చేశారు. చేతులు కట్టేసి, గొంతు కోసి చంపారు.
హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి బల్జీత్ కౌర్ గురుద్వారలో ఉంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తొలుత విషయాలు దాచాలని ఆమె ప్రయత్నించినా చివరికి నోరు విప్పింది. ఈ నెల 1న ఈ హత్య విషయం వెలుగులోకి రావడంతో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులూ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి ప్రత్యేక బృందం వెళ్లేసరికి వాళ్లు తప్పించుకున్నారు. దీంతో మరో రెండు బృందాలు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.