ముగ్గురు పిల్లల తల్లితో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని... మనస్థాపంతో యువకుడు సూసైడ్
ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లాడేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబాబాద్ : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుచెప్పారని ఓ యువకుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పెద్దలను ఎదిరించి వివాహితను పెళ్ళాడలేక... అలాగని ఆమెను విడిచి వుండలేకపోయిన యువకుడు తీవ్ర మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రానికి చెందిన బాణాల వెంకటేశ్(25) తాపీ మేస్త్రీ. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వీదిలో కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. ఇదే కాలనీలో వుండే ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో వివాహిత వెంకటేశ్ తో చనువు పెంచుకుని శారీరక సంబంధం పెట్టుకుంది.
అయితే ఇటీవల వివాహిత భర్త మృతిచెందాడు. దీంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమెను పెళ్లాడాలని వెంకటేశ్ బావించాడు. కానీ అతడి తల్లిదండ్రులు వివాహితను పెళ్లాడేందుకు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రుల మాట కాదనలేక... అలాగనీ ఇష్టపడ్డ వివాహితను విడిచి వుండలేక తీవ్ర మనోవేదనకు గురయిన వెంకటేశ్ జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read More ప్రకాశంలో విషాదం... వదినతో కలిసి మరిది సూసైడ్
తల్లిదండ్రులు ఇంటికి తిరిగివచ్చేసరికి వెంకటేశ్ ప్రాణాలు కోల్పోయి ఉరికి వేలాడుతూ కనిపించాడు. కొడుకును అలా చూసిన కన్నవారు గుండెలవిసేలా రోదించారు. వెంకటేశ్ తండ్రి శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు వెంకటేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)