Asianet News TeluguAsianet News Telugu

బంధాల్ని చిదిమేస్తున్న ఆస్తులు... అన్నని దారుణంగా చంపిన తమ్ముళ్లు

ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్న రోజులివి. కన్న తల్లిదండ్రులను, భార్య, బిడ్డలు, తోడ బుట్టిన వాళ్లను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఆస్తి  కోసం ఇద్దరు తమ్ముళ్లు అన్ననే చంపేశారు. 

younger brothers killed elder for property in rangareddy district ksp
Author
Hyderabad, First Published Mar 5, 2021, 4:09 PM IST

ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్న రోజులివి. కన్న తల్లిదండ్రులను, భార్య, బిడ్డలు, తోడ బుట్టిన వాళ్లను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఆస్తి  కోసం ఇద్దరు తమ్ముళ్లు అన్ననే చంపేశారు.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య, పాండు, శ్రీనివాస్‌ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం వారిలో పెద్దవాడైన యాదయ్యతో తమ్ముళ్లిద్దరూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఘర్షణ తారస్థాయికి చేరడంతో పాండు, శ్రీనివాస్‌ కలిసి అన్న యాదయ్యను కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం పాండు, శ్రీనివాస్‌ శంకర్‌పల్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios