Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికలు.. వైసీపీ మద్దతు ఎవరికంటే...

ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి రేగింది. కాగా.. దీనిపై ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు.

ycp gave clarity over telangana elections
Author
Hyderabad, First Published Nov 19, 2018, 11:16 AM IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీచేసింది. అయితే.. సీట్లను దక్కించుకోవడంలో మాత్రం విఫలం చెందింది. అందుకే.. ఈ సారి ఎన్నికల్లో జగన్.. తన పూర్తి ఏకాగ్రత మొత్తం ఏపీ పైనే పెట్టారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనను విరమించుకున్నారు.

అయితే.. మరి తెలంగాణలో ఉన్న వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి..? వాళ్ల పార్టీ పోటీ చేయడం లేదుకాబట్టి.. మరి ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి రేగింది. కాగా.. దీనిపై ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు.

తమ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు కాబట్టి.. తాము ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత రామ్మోహన్ రావు ప్రకటించారు. సనత్ నగర్ లోని తమ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి మాజీసీఎం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదన్నారు. ఏ పార్టీ అభ్యర్థి అభివృద్ధికి పెద్దపీట వేస్తారో.. వారికే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థిని బట్టి తమ మద్దతు తెలుపుతామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios