Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు.. అడ్డుగా ఉన్నాడని భర్తని..

భార్యా, భర్తలకు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రాజు భార్య శివరాత్రి అనిల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త రాజుకి తెలియడంతో.. పలుమార్లు మందలించాడు. దీంతో.. భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.

woman kills husband over illicit relationship in warangle
Author
Hyderabad, First Published Mar 23, 2020, 11:21 AM IST

ఆమెకు పెళ్లై.. భర్త, పిల్లలు ఉన్నారు. అయితే... భర్తను కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త భర్తకు తెలిసి గొడవలు మొదలయ్యాయి. దీంతో... భర్తను అడ్డు తప్పించాలని ప్రయత్నించింది. ప్రియుడి సహాయం తీసుకొని ఇంట్లోనే భర్తకు ఉరివేసింది. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.

Also Read పెళ్లైన వారానికే.. శుభలేఖపై సూసైడ్ లెటర్ రాసి... నవ వధువు.....

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ కాశికుంటలో రాదారపు రాజు (33) తన భార్యతో నివాసముంటున్నాడు. భార్యా, భర్తలకు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రాజు భార్య శివరాత్రి అనిల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త రాజుకి తెలియడంతో.. పలుమార్లు మందలించాడు. దీంతో.. భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.

దీనిలో భాగంగానే..శుక్రవారం రాత్రి అనిల్‌తో కలిసి భర్తను తాడుతో మెడకు ఉరివేసి చంపింది. ఎవ్వరికీ తెలియకుండా తెల్లవారుజామున ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. మృతదేహం ఇంట్లోనే పడి ఉండడంతో కుళ్లిన వాసన వచ్చింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే మిల్స్‌కాలనీ సీఐ నరేష్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి చెల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios