తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా మహిళ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె సీపీని కోరింది.

సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడానికి ముందే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలుచెప్పింది.రఘునందన్ రావు తొలుత టీఆర్ఎస్‌లో ఉన్నాడు. టీఆర్ఎస్‌లో రఘునందన్ రావు ఎక్కువ కాలం ఉండలేదు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేతల్లో ఆయనకు చోటు దక్కింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.